సిరా న్యూస్,జగిత్యాల;
శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా పూర్తి చేసినందున బుధవారం ఐడివోసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా ని మర్యాద పూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం తరపున కలిసి శుభాకాంక్షలు తెలిపారు…ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ఇది ఉద్యోగులందరిది సమిష్టి కృషి వల్ల జరిగిన విజయమని కొనియాడారు.. అలాగే భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా మన అందరి సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగుల సంతోష్ కుమార్ , ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్ ,అసోసియేట్ కందుకూరి రవిబాబు, విజేందర్, విశ్వాన్ , ప్రభు, కిరణ్, హనుమంతరావు, సంగి రాజేశ్వరి, శైలజ రాణి తదితరులు పాల్గొన్నారు..