ముదిరాజ్ లను బీసీ- ఏ లో చేర్చాలి

సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి;
ముదిరాజ్ లను బీసీ డి నుండి బీసీ- ఏ లో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అద్యక్షుడు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మత్స్య సహకార సంఘం రాష్ట్ర ఛైర్మన్ పదవి ముదిరాజ్ లకే ఇవ్వాలని అన్నారు. మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్య సహకార సంఘాల ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ. 1వెయ్యి కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. రాజకీయంగా పదవుల పంపకాల్లో ముదిరాజ్ లకు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశం లో వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, రాగినేడు, చీకురాయి సొసైటీ అధ్యక్షులు గుర్రాల లింగయ్య, పిడుగు రవి, ముదిరాజ్ అధ్యయన వేదిక జిల్లా అద్యక్షుడు గరిగంటి నరసింహరాజు, తీగల ధర్మపురి, కందుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *