శాంతి విషయంలో ఎంపి విజయసాయి రెడ్డి స్పందన

ప్రతిష్ట దిగజార్చిన వారిని వదలను

 సిరా న్యూస్,విజయవాడ;
దేవాదాయా శాఖ అధికారిణి శాంతి విషయంలో ఎంపి విజయసాయి రెడ్డి స్పందించారు. మీ ఇంట్లో మీ అమ్మకు మీ చెల్లికి మీ తోబుట్టువుకో జరిగితే ఇలాగే అల్లరి చేస్తారా అని ప్రశ్నించారు. మీ చరిత్ర అంతా తెలుసు. ఎక్కడ నుంచి ఏ స్థాయికి వచ్చారు. అన్ని గుట్టు విప్పుతా . ఒక మహిళను రోడ్డుకి ఈడ్చి డిబేట్లు పెడతారా. ఇది సంస్కారమేనా అని ప్రశ్నించారు. చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా. త్వరలోనే ఛానల్ పెడతానని అన్నారు. వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తుంది. మీ తాటాకు చప్పట్లు భయపడను. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను. నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్, ట్రైబల్ కమిషన్, పార్లమెంటు వరకు పోతానని అన్నారు. బుద్ధి లేనివాడు ఎవడైనా తండ్రి వయసున్న నాకే ఒక ఆదివాసి మహిళను అంటగడతారా. పార్లమెంట్లో వంశీకృష్ణ పై ప్రివిలేజ్ మోషన్ వేస్తా. బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు. ఇది కుట్రలో భాగంగానే జరిగిందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *