సిరాన్యూస్, ఓదెల
నేత్రదాత దేవరకొండ రామ్మూర్తి సంస్మరణ సభ
హాజరైన సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి
* కుటుంబ సభ్యులకు జ్ఞాపిక అందజేత
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత దేవరకొండ రామ్మూర్తి సంస్మరణ సభను సోమవాం స్వగృహం ఓదెలలో ,సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్బంగా బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ బొంగోని లింగమూర్తి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు కోడండ్లు ప్రభాకర్ స్వర్ణ , సతీష్ , శిరీష లకు, కూతురు అల్లుడు జ్యోతి దినేష్లకు జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాతం మల్లేశం, బంధు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు .