సిరాన్యూస్,ఆదిలాబాద్
డీజిల్, పెట్రోల్ డబ్బులు ఇప్పించాలని కలెక్టర్కు రాకేష్ కస్తూరి వినతి
గత పార్లమెంటు ఎన్నికల్లో వాహనాలకు డీజిల్ పెట్రోల్ పోయడం జరిగిందని, అయితే తనకు రావలసిన ఐదు లక్షల 37వేల రూపాయలు ఇవ్వడం లేదని రంజిత్ పెట్రోల్ పంప్ యజమాని రాకేష్ కస్తూరి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ విన్నవించారు. అయితే ఎన్నికల సందర్భంగా ఐటిడిఎపిఓతో పాటు ఆర్డిఓ స్థానిక తాసిల్దార్లు డీజిల్ పెట్రోల్ పోయాలని, అందుకు సంబంధించిన డబ్బులు ఎన్నికల అనంతరం చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారని బంకు యజమాని తెలిపారు. తాను 18 లక్షల రూపాయల విలువచేసే ఇంధనం పోయడం జరిగిందని తెలిపారు. అందులో నుండి మిగిలిన 5 లక్షల 37 వేల రూపాయలు ఇవ్వడంలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్పందించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తక్షణమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని, జాప్యం ఎందుకు జరిగిందనే విషయం క్రింది స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారని బంక్ యజమాని పేర్కొన్నారు.