సిరాన్యూస్,ఖానాపూర్
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇంటి ముందు అంగన్వాడీల ధర్నా
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం అంగన్వాడీలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ వర్కర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.