సిరాన్యూస్, బేల
సైదాపూర్ లో దారుణం… భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం
భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సైదాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేలా మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో లక్ష్మణ్, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్బంలో ఆవేశానికిలో నైన లక్ష్మణ్ సునీత గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అంబులెన్సుకు ఫోన్ చేసి జిల్లా రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా డిఎస్పీ జీవన్ రెడ్డి , జైనథ్ సీఐ, బేల పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి సునీత తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.