సిరా న్యూస్, కోనరావుపేట:
పనికోసం వెళ్లి… శవమై తిరిగి వచ్చాడు..
+ వెళ్ళిన నెల రోజులకే మృత్యువాత
+ బహ్రెయిన్ లో బావుసాయిపేట యువకుడి మృతి
+ గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం గల్ఫ్ కి వెళ్లిన ఓ యువకుడు అక్కడ జరిగిన ప్రమాదానికి బలికాగా.. వారం రోజులకు శవపేటిక ఇంటికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బొడ్డు బాబు(29) నెల రోజుల క్రితం బహ్రెయిన్ దేశం వెళ్లాడు. ఈ నెల 7న అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తుండగా సెంట్రింగ్ పనికి వినియోగించే పెద్ద రాడ్ నాలుగో అంతస్తు మీదనుంచి బాబుపై పడింది. ఈ ప్రమాదం లో బాబు అక్క డికక్కడే మృతిచెందగా, తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి రాజనర్సయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, తల్లి లచ్చవ్వ , భార్య శిరీష, నాలుగేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నారు. కాగాస్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ గోలి మోహన్ అక్కడి ఇండియన్ ఎంబసీతో మాట్లాడి మృతదేహం ఇంటికి చేర్చడంతో, గురువారం మృతుడి స్వగ్రామంలో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.