సిరా న్యూస్, నేరడిగొండ
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: బీజేపీ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ సింగ్
రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీజేపీ నేరడిగొండ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కోసం రైతులా కాదా అని చూడాలని, రేషన్ కార్డు చూడటమేంటని ప్రశ్నించారు. పాస్ బుక్ ఉన్న ప్రతీ రైతులందరికీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పని అన్నారు. ప్రభుత్వ నిబంధనలతో సగం రైతులకు రుణమాఫీ అందదని చెప్పారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధానకార్యదర్శులు రాజశేఖర్, రాఘవులు, ప్రవీణ్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధానకార్యదర్శి రాములు ఉన్నారు.