సిరా న్యూస్,హైదరాబాద్ ;
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. జెఎన్టియులో చట్నీలో పడిన ఎలుక, ఆహారం తింటున్న పిల్లికి సంబంధించిన ట్వీట్ను కెటిఆర్ పోస్టు చేశారు. జెఎన్టియు క్యాంపస్ పిల్లి, ఎలుకలకు నిలయంగా మారిందని నవ్వే ఎమోజీ జత చేసి చురకలంటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. బిఆర్ఎన్ నేత మన్నె క్రిశాంక్ కు చెందిన పోస్టును కెటిఆర్ రిట్వీట్ చేశారు.