X ZPTC Ande Swamy: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి :మాజీ జడ్పీటీసీ అందే స్వామి

సిరాన్యూస్, చిగురుమామిడి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి :మాజీ జడ్పీటీసీ అందే స్వామి
ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ లక్ష్యం
* సీపీఐ పోరాటాల ఫలితమే.. ఈ ప్రాంతానికి సాగునీరు
*  ప్రజల అండతో పార్టీకి మళ్లీ పునర్వైభవం
*  పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సత్తా చాటాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీ అందే స్వామి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో మంగళవారం సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, అందే స్వామి పర్యవేక్షణలో గ్రామ శాఖ ఎన్నికలు జరిగాయి.చిగురు మామిడి గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా అల్లపు జంపయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అందే స్వామి మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం సీపీఐ పార్టీ పాటుపడుతుందన్నారు. అలుపెరుగని పోరాటాలతోనే ఈ ప్రాంతానికి సాగునీరు సాకారం అవుతుందని తెలిపారు. ప్రజల అండతో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. సీపీఐ పార్టీ పేద ప్రజల కోసం, రైతాంగ సమస్యల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీపీఐ పార్టీకే దక్కుతుందన్నారు. సిపిడబ్ల్యూఎస్ పథకం ద్వారా గ్రామాలలో తాగునీటి సమస్యల పరిష్కరించామని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేశాము కనుకనే చిగురుమామిడి మండలాన్ని కమ్యూనిస్టుల కంచుకోటగా చేసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి.. మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కార్యకర్త అంకుఠిత దీక్షతో పనిచేయాలని ఉన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముద్ర కోల రాజయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి అందే చిన్నస్వామి, మహిళ సమైక్య మండల బాధ్యులు రాకం అంజవ్వ, సింగిల్ విండో మాజీ చైర్మన్ తేరాల సత్యనారాయణ, సిపిఐ గ్రామ శాఖ మాజీ కార్యదర్శి అను వోజు జనార్ధన్, నక్క కేతవ్వ, నోముల లక్ష్మి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *