సిరాన్యూస్, ఓదెల
మంత్రుల సభ ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
* నేడే ఓదెల మండలంలో మంత్రుల పర్యటన
ఓదెల మండలం పరిధిలోని కొలనూర్, పెద్దరాత్ పల్లి, కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతాలలో రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోన్నం ప్రభాకర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజి) తెలిపారు. సీపీ పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్లతో కలిసి హెలిప్యాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం,పాలం ఆయిల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ స్టోన్ ప్రాంతం, రెడ్డి ఫంక్షన్ హల్ లోని పబ్లిక్ మీటింగ్ ప్రాంతాల పరిశీలించారు. పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు లపై సమీక్షించారు. అధికారులకు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్, శిల పలకాల ప్రారంభోత్సవాల వద్ద ఉండే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్య అతిథులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చుడాలని అధికారులకు భద్రతాపరమైన ఆదేశాలు, సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.