సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది…జిల్లాలో పెద్ద గనగళ్ళ వాని పేటలో సాయి బాబా విగ్రహం పాలు తాగుతోంది…గ్రామంలో బర్రి తాతారావు కుటుంబ సభ్యులు ఏడు వారాలపాటు సాయిబాబా వ్రతం చేశారు… ఏడు వారాలపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన అనంతరం సాయిబాబా విగ్రహం వద్ద స్పూన్ తో విగ్రహం నోటి వద్ద పాలు పెట్టగా పాలు తాగుతుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు…అయితే కొంతమంది గ్రామస్తులు సాయిబాబా ఫోటో వద్ద పాలు పెట్టగా పాలు తగలేదు…విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సాయిబాబా విగ్రహం చూసేందుకు తరలివచ్చారు…
=