Kandi Tirupati Reddy: రుణమాఫీతో రైతుల‌కు ఎంతో మేలు : కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి

సిరాన్యూస్‌, చిగురుమామిడి
రుణమాఫీతో రైతుల‌కు ఎంతో మేలు : కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి
* సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మండల రైతులు
* బాణాసంచా పేల్చి సంబరాలు

పెట్టుబడుల సమయంలో రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ని ప్రకటించడంతో చిగురుమామిడి మండలంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రైతులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు నేటి నుండి రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతులు ఆనంద పడుతున్నారని, పెట్టుబడుల సమయంలో రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతు రుణమాఫీతో సిఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచాడు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్లీ రైతు రాజ్యం వచ్చిందని, రైతులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్, జిల్లా నాయకులు చిట్టిమల్ల రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్ కుమార్, ఐ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *