-ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.డి.తాహెర్ హుస్సేన్
-డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరిచయ కార్యక్రమం
సిరా న్యూస్,మంథని ;
ప్రభుత్వ కళాశాలలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.డి.తాహెర్ హుస్సేన్ అన్నారు.
గురువారం కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థులకు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.కళాశాలలో ఉన్న సదుపాయాలైన ఎన్.ఎస్.ఎస్, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, వర్చువల్ క్లాస్ రూములు , స్కాలర్షిప్ సదుపాయం, ప్లేస్మెంట్ సెల్, టాస్క్, వివిధ రకాల క్లబ్బులు,సీసీటీవీ పర్యవేక్షణ, విద్యా సంబంధిత, సహా విద్యా సంబంధిత విషయాల గురించి కూలంకషంగా కళాశాల ఐక్యుఏసి కోఆర్డినేటర్ కర్నాటి కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థులంతా కూడా సదుపాయాలను వినియోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ పరిషయ్య, గ్రంథ పాలకులు డా.భరత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందము, మానస ,రజిత, బోధనేతర సిబ్బంది అశోక్, శ్రీనివాస్, ముజాహిద్, సుధాకర్, రాజు దుర్గరాజు ,సురేష్ లతో పాటు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.