సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: కౌన్సిలర్ పౌజియ షబ్బీర్ పాషా
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కౌన్సిలర్ పౌజియ షబ్బీర్ పాషా అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సుభాష్ నగర్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా కౌన్సిలర్ పౌజియ షబ్బీర్ పాషా మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో లార్వా తయారై విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇండ్లలో కూలర్లలో, నీటి కుండిలలో,చెట్ల కుండిలలో పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండ జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం వ్యాధులతో బాధ పడుతున్న రోగుల రక్త నమూనాలను వైద్య సిబ్బంది నారాయణ సేకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్ పాషా, ఏ ఎన్ ఎం పద్మ, మెప్మా సిబ్బంది నారాయణ, ఆశ వర్కర్ పుష్ప, అంగన్వాడీ టీచర్ సరోజ ,మమత,తదితరులు పాల్గొన్నారు.