సిరాన్యూస్, ఆదిలాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, హామీలు గ్యారంటీలు అన్ని కాంగ్రెస్ పార్టీ మోసాలకు ప్రతీకలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతు భరోసా కానీ, రుణ మాఫీ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానివ్వండి అన్ని కూడా నెరవేర్చడంలో విఫలమయ్యిందని అన్నారు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ఓటర్లు ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. రాబోయే సంస్థాగత ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నేటి ప్రతి కార్యకర్త రేపటి నాయకుడు భారతీయ జనతా పార్టీలో పనిచేసే నిమ్నస్థాయి కార్యకర్త కూడా అత్యున్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉందని అన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే అధికార పార్టీ మన పై ఎన్నో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మనమంతా ఐక్యమత్యంగా ధైర్యంగా నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్మ, మండల జిల్లా, నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.