గోదావరికి వదర పోటు

సిరా న్యూస్,కోనసీమ;
పి.గన్నవరం నియోజవర్గంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతుండటంతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి వరద ప్రవహానికి కొట్టుకుపోవడంతో.. నదికి అవతల ఉన్న లంక గ్రామాల ప్రజలు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. మళ్ళీ వరదల సీజన్ ముగిసేవరకూ ఈ నాలుగు గ్రామాల పరిస్థితి దినదినగండమే.. చిన్నపాటి పనులకు కూడా వీరు నదీపాయను దాటాల్సిందే. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దమనీయం. వరద ప్రవాహంలో రోజూ పడవ దాటుతూ స్కూల్స్ కు వెలుతూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. ఎలాంటి భద్రత లేకుండానే వీరు గోదావరి ఉదృతిలో రాకపోకలు సాగిస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని అయినవిల్లి లంక, కనకాయిలంక కాజ్ వేల పైకి వరద నీరు చేరుతుంది. దీనితో చాలా లంక గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *