సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైలం మహాక్షేత్రంలో 53 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది.ఇందులో శాశ్వత ఉద్యోగుల,ఒప్పంద ఉద్యోగులు,పొరుగుసేవ ఉద్యోగులు మొత్తంగా 53 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ కొందరికి ఆదనపు బాధ్యత విధులు కేటాయించారు.ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం రెండోవసారి కాగా శ్రీశైలం దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు అలానే కొందరికి అదనపు బాధ్యతలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు.అయితే పర్యవేక్షణాధికారి స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీలు చేయడం విశేషం అలానే బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు.ఈ మేరకు పలువురు ఉద్యోగులు వారి వారికి కేటాయించిన విధులలో రిపోర్ట్ కూడ సిద్దమయ్యారు..