BRS Salim: జహీర్ రంజాని రౌడీయిజం పెరిగిపోయింది:  మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు సలీం

సిరాన్యూస్, ఆదిలాబాద్
జహీర్ రంజాని రౌడీయిజం పెరిగిపోయింది:  మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు సలీం

ఆదిలాబాద్ మున్సిపల్ లో మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజాని అవినీతి, ఆగడాలు హద్దు మీరి పోవడంతో అత‌నిపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణమని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం నాయకులూ సలీం స్పష్టం చేశారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైస్ చైర్మన్ అవిశ్వాసం కోసం కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సంతకాలు చేసిన విషయాన్నీ గుర్తు చేశారు. జహీర్ రంజాని కాంగ్రెస్ లో చేరే సమయంలో స్వంత పార్టీకి చెందిన మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రౌడీయిజం, అవినీతి పెరగడమే అవిశ్వాసానికి దారి తీసిందని, అందుకు అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ మద్దతు తెలిపారని అన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు అనుభవించిన మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ అధికారం నుండి దిగిపోగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గత జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేశాయని గుర్తు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న మైనారిటీ ల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని, భవిష్యత్తులోనూ తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే ముస్లిం అభ్యర్తినే నిలబెడతారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇమ్రాన్, మోబిన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *