సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
శ్రీ శ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులుగా కల్వకుంట్ల నారాయణ
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కావలి సంతోష్ ( మున్సిపల్ వైస్ చైర్మన్), అధ్యక్షులుగా కల్వకుంట్ల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బక్క శెట్టి లక్ష్మణ్, కోశాధికారిగా సిరిపురం నాగరాజు, ఉపాధ్యక్షులుగా బి సి రాజన్న,ఇరవేణి (ఇస్తారి) రాములు. జైహింద్ సెక్రెటరీ. రాచమల్ల రాజశేఖర్, ఉప కోశాధికారిగా దేవల రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొండ ప్రశాంత్, ప్రచార కార్యదర్శిగా ఘంటసాల గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆలయ కమిటీ అభివృద్ధి కోసం చర్చించారు.