సిరాన్యూస్, ఓదెల
ఆకుల సాంబయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తండ్రి ఆకుల సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారి వెంట మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్, వెంకట్ రెడ్డి, పోలోజు రమేష్, బుద్ధే పోశెట్టి, మహేందర్ డాక్టర్ సతీష్, నరేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.