Shravan Kumar: ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి: సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్

సిరాన్యూస్,ఓదెల‌
ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి: సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్
* సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనమహోత్సవం

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలని సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ అన్నారు. ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ పంచాయ‌తీ సదాశయ ఫౌండేషన్ నిర్వహణలో ఓదెల వైకుంఠధామంలో మొక్క‌లు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారినేత ఆధ్వర్యంలో నిర్వహించగా,దీనికి అతిథులుగా సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ఓదెల మండలం విద్యుత్ శాఖ ఇంజనీర్ మోహన్ నాయక్ పాల్గొని మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ,కాలుష్యం నివారణలో భాగంగా వైకుంఠ ధామంలో చెట్లు నాటడం వలన ప్రజలకు నీడను , పండ్లు,పూల చెట్లవలన అహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని వారన్నారు.నాటిన మొక్క‌ల‌ను కాపాడే బాధ్యత గ్రామ పంచాయితీ, ప్రజలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి స‌హ‌క‌రించిన‌ ఓదెల మేజర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ భాస్కర్,ఈజీఎస్‌ అధికారి శ్వేత, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లం సతీష్, కోటి, క్యాతం మల్లేశం, మేర్గు. సారంగం, డాక్టర్ ఇప్పన పెళ్లి వెంకటేశ్వర్లు ,మెరుగు సత్యనారాయణ, క్యాతం వెంకటేశ్వర్లు మేర్గు. మల్లేశం కోటగిరి స్వామి, నాగపురి రవి, చెరుకు. వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *