రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో రోడ్డు ప్రమాదం.. కార్మికుడి మృతి

సిరా న్యూస్,జగ్గయ్యపేట:
జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు తండాలోని మద్రాస్ సిమెంట్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) వారి రామ్కో సిమెంట్స్ ఆవరణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నాగులు (47) మృతి చెందారు. జయంతిపురం గ్రామానికి చెందిన నాగులు కర్మాగారంలో 15 సంవత్సరాలుగా కార్మికుడిగా పని చేస్తున్నారు. కర్మాగారంలో విధులు రోడ్లను శుభ్రం చేసే వాహనం వెనక్కు వస్తూ వచ్చి ఢీకొ ట్టడంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను కర్మాగారంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్లో విజయవాడకు తరలించారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పటల్ ఐసీయూలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్ధారించారు. కర్మాగారం ఆవరణలో జరిగిన ప్రమాదం కారణంగా నాగులు మృతి చెంది నందున యాజమాన్యమే బాధ్యత వహించాలని బంధువులు, కార్మిక నేతలు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *