సిరా న్యూస్,కోనసీమ జిల్లా;
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శనివారం కావడంతో ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం. ఇలా ఏడు శనివారాలు దర్శించుకుని స్వామి మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేస్తే భక్తులు కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. దీంతో స్వామి దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు తరలు వచ్చారు. అయితే ఆలయ పరిసరాలు వర్షం ప్రభావంతో బురద మయంగా మారడం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
===========