సిరాన్యూస్,ఉట్నూర్
అపోలో డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ (ఐబి)లో నూతనంగా ఏర్పాటైన అపోలో డయాగ్నొస్టిక్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు ఆత్రం సుగుణక్క, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆజ్మీర శ్యాంనాయక్ తో కలిసి ప్రారంభించి నిర్వాహకులు ఖాసిం అన్సారిను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి సేవలు అందించడం గర్వకారణం అన్నారు. అపోలో డయాగ్నోస్టీక్ ఉట్నూర్లో రావడంవల్ల ప్రజలకు హైదరాబాద్, కరీంనగర్ లాంటి దూరప్రాంత పట్టణాలకు వెళ్లకుండా మనదగ్గరే అన్ని రకాల వైద్య పరీక్షలకు సౌకర్యం కల్గిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యుం,బ్లాక్ ప్రెసిడెంట్ సయ్యద్ ఎక్బాల్, అహ్మద్ అజీమొద్దిన్, జాదవ్ సుమన్ బాయి, సయ్యద్ నిసార్, మబూద్,ఉస్కమల్ల దేవిదాస్, జవ్వాద్ అన్సారి, రాజేశ్వర్, కొల్లూర్ స్వామి, రాజేందర్,సుశీల్ తదితరులు పాల్గొన్నారు.