సిరాన్యూస్, కడెం
కడెం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి
భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కడెం మండల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి సూచించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ చెట్ల క్రింద, పాడైన భవనాల క్రింద ,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దన్నారు. అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగం లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరెంటు ,ఇనుప స్తంభాలు ట్రాన్స్ఫర్లను ముట్టుకోవద్దని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా తెరవచ్చు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.