సిరాన్యూస్, కడెం
చికిత్స పొందుతూ యువకుడు కొట్టే కిరణ్ మృతి
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండవపూర్ గ్రామానికి చెందిన కొట్టే కిరణ్ (24) అనే యువకుడు ఈనెల 12వ తేదీన పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొట్టే కిరణ్ హుటాహుటిన ఖానాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొట్టే కిరణ్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.