సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ పార్టీకి దశాదిశ చూపిన నేత సీఆర్ఆర్: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి
* కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళి
స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి దశాదిశ చూపిన నేత అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కంది శ్రీనవాస రెడ్డి అన్నారు. సీఆర్ ఆర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవాభవన్ లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఆర్ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ లో సీఆర్ఆర్ అంటే కాంగ్రెస్ ..కాంగ్రెస్ అంటే సీఆర్ఆర్ అన్నది ఎల్లప్పుడు గుర్తుండి పోతుందన్నారు. నిరుపేదల పాలిటి పెన్నిధిగా ఆయన వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ఆయన చూపిన బాటలోనే ప్రతీ కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త నడుచుకోవాలన్నారు. ఆయన భౌతికంగా మనమధ్య లేక పోయినా మనం చేసే ప్రతీ మంచి పనిలోను ఆయన గుర్తుండి పోతారన్నారు. ప్రతీ కార్యాచరణలో ఆయన కార్యకర్తలకిచ్చిన సలహాలు సూచనలు గుర్తుకొస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్లు ఆవుల వెంకన్న,రామ్ కుమార్, దర్శనాల లక్ష్మణ్, జాఫర్ అహ్మద్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, నాయకులు ఎం.ఏ షకీల్,ఎం.ఏ కయ్యుమ్, డేరా కృష్ణ రెడ్డి, ముడుపు ప్రశాంత్ రెడ్డి, పోరెడ్డి కిషన్, బూర్ల శంకరయ్య,బాసా సంతోష్, సోమ ప్రశాంత్, రఫీక్, భాస్కర్ రెడ్డి,యాల్ల పోతా రెడ్డి, అల్లూరి భూమ రెడ్డి, అనుముల ఉదయ్ కిరణ్, కుర్ర నరేష్, తలా చౌష్ తదితరులు పాల్గొన్నారు