CI Saida Rao: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ సైదారావు

సిరాన్యూస్, ఖానాపూర్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ సైదారావు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఖానాపూర్ సీఐ సైదారావు సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ సీఎం రావు ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్ తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్య‌క్ర‌మంలో ఎస్సై లింబాద్రి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *