హుజురాబాద్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులను ఆదుకోకపోవడం శోచనీయం
సిరా న్యూస్,హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్థానాన్ని, తనవంతుగా తన శాసనసభ సభ్యుడిగా వచ్చిన జీతాన్ని 31 బాధితులకు తల ఒక్కరికి పదివేల చొప్పున రూ .3 లక్షల 10వేలు అందజేసినట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు తన వంతుగా రేకుల షెడ్డుల కొరకు లక్ష రూపాయలు ఇచ్చానన్నారు. అన్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆర్డీవో, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ సందర్శించి పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి నివేదించినప్పటికీ వారం రోజులు దాటిన కనీస నష్టపరిహారం మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించకపోవడం వారిని ఆదుకునేందుకు కనీస ప్రకటన చేయకపోవడం మంత్రి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధితులను పట్టించుకోవడం లేదనీ,
అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్లిపోయారు. వారికి ఆర్థిక సహాయము చేయకపోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాద బాధితులు తెలంగాణ రాష్ట్రంలో లేరా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధితులు గుర్తుకు రావడం లేదు అన్నారు. పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే కనీసం పరామర్శించకపోవడం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్న చూపుకు నిదర్శనం కాదా అని కౌశిక్ ప్రశ్నించారు. అగ్ని ప్రమాద బాధితులను ఆర్థికంగా ఆదుకోకపోతే తక్షణమే బాధితులతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఇట్టి విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావిస్తాననీ స్పష్టం చేశారు. బాధితులకు శాశ్వత ప్రతిపాదికన పునరవాసం కల్పించి అన్నవిధాల ఆదుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
………….
అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు బాగు చేయాలి:
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి……
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుజురాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటిని బాగు చేయించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వీణవంక మండలం వల్లభాపూర్, మామిడాలపల్లి, మల్లన్నపల్లి, జమ్మికుంట మండలం రాఘవరెడ్డిపేట -టేకుమట్ల బ్రిడ్జి, ఇల్లంతకుంట కమలాపూర్ హుజురాబాద్ మండలాల్లోని పలు గ్రామాలలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు శిథిలమై ప్రజలు అవస్థలకు గురవుతున్నారని తక్షణమే వాటిని బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మునిసిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ వైస్ చైర్ పర్సన్ కలిపాక నిర్మల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, తాసిల్దార్ విజయ్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు బాధితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *