MLA Anil Jadhav: పేద బిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి:  ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్

సిరాన్యూస్‌, బోథ్‌
పేద బిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్

పేద బిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మిమ‌ని బోథ్‌ శాసనసభ్యులు అనిల్ జాద‌వ్ అన్నారు.సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణ‌ లక్ష్మీ పథకం కింద మంజూరైన 26 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పేద బిడ్డల పెండ్లిల్లు చేయడం నిరుపేద కుటుంబాల వారికి ఇబ్బందిగా ఉంటుందని భావించి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇటువంటి పథకం దేశంలోనే ఎక్కడ లేదని తెలిపారు. గత ముఖ్యమంత్రి హయంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు .ప్రభుత్వపరంగా మంజూరయ్యే పథకాలు అర్హులైన వారందరికీ అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి డాక్టర్ సంధ్యారాణి ,మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, ఎంపీటీసీ మాజీ నారాయణరెడ్డి , తహసిల్దార్ సుభాష్ చంద్ర, ఎంపీడీవో రమేష్, డిప్యూటీ త‌హ‌సీల్దార్ భూమేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మొక్కలను నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *