Chavanapelli Kamalakar: బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ కోసం రూ. 500 కోట్లు ప్రకటించాలి

సిరాన్యూస్‌,గన్నేరువరం
బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ కోసం రూ. 500 కోట్లు ప్రకటించాలి
* ఒమాన్ శాఖ అధ్యక్షుడు చవనాపెల్లి కమలాకర్
*  సీఎంకు గల్ఫ్ కార్మికుల విజ్ఞప్తి

బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ కోసం రూ. 500 కోట్లు ప్రకటించాల‌ని ఒమాన్ శాఖ అధ్యక్షుడు చవనాపెల్లి కమలాకర్ అన్నారు. సోమ‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.ఈసందర్భంగా గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల ఆకాంక్ష తెలంగాణా ఎన్ ఆర్ ఐ పాలసీ గత ప్రభుత్వం సమగ్ర ఎన్ ఆర్ ఐ పాలసీ ఇస్తామని అధికారంలోకి వచ్చినా పట్టించుకున్న పాపనపోలేదని, ఎక్సగ్రేషియా కూడా ఇవ్వలేదని ,బాధితుల సమస్యలు విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మీరైనా మా గల్ఫ్ కార్మికుల కోసం 500.కోట్లతో ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలలో ప్రకటించాలని ఒమాన్ శాఖ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జీడ‌బ్లూఏసీ ) ద్వారా కోరుతున్నామని, తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్, సెక్రెటరీ కొత్త చిన్నయ్య ,ఇంచార్జి&కోర్దినేటర్లు నిమ్మరాజుల పెద్దకాశి, గురుపెల్లి నర్సయ్య ,నిమ్మల శేఖర్ ,ఆర్ల నవీన్, గాజుల వెంకటేశం, దాసరి మల్లేశం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *