సిరాన్యూస్, ఖానాపూర్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్
ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్ అన్నారు. మంగళవారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సుభాష్ నగర్ లో వార్డు కౌన్సిలర్ పౌజియా షబ్బీర్ పాషా ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్ మాట్లాడుతూ వర్షాల వల్ల కాలనీల్లో నీటి నిల్వల్లో దోమలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవడం ద్వారా అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొనేలా వారికి తెలియజెప్పాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకురావాలని తల్లిదండ్రులకు సూచించాలని తెలిపారు. ఇండ్లలో కూలర్లలో,నీటి కుండిలలో, చెట్ల కుండిలలో పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ సంతోష్, మెప్మా సిబ్బంది నారాయణ, లావణ్య, ఆశా వర్కర్ పుష్ప, అంగన్వాడీ టీచర్ మమత, తదితరులు పాల్గొన్నారు.