సిరాన్యూస్, జైనూర్
1.5కేజీల గంజాయి పట్టివేత: జైనూర్ ఎస్ఐ సందీప్ కుమార్
జైనూర్ మండల కేంద్రంలో ఆదివారం వాహనాల తనిఖీల్లో 1.5కేజీల గంజాయి పట్టుబడినట్లు జైనూర్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు సిబ్బంది ఆదివారం వాహనాలు తనిఖీ నిర్వహించారు. జైనూర్ నుండి ఆసిఫాబాద్ కు వెళ్ళుతున్న ఒక ఇండికా కార్ ను తనిఖీ చేశారు. ఈ కారులో 1.5 కెజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.