సిరాన్యూస్, బోథ్
వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులు దూరం: డాక్టర్ నవీన్ రెడ్డి
* వసతి గృహంలో వైద్య శిబిరం
వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని డాక్టర్ నవీన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వసతి గృహంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు వివరించారు. అంతేగాక ప్రతివారం తమ పడుకునే బట్టలను శుభ్రంగా ఉతుకుకోవాలని సూచించారు.ఏమైనా తినే ముందు కాళ్లు, చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హెచ్ ఎస్ కవిత, ఎంఎల్ హెచ్పీ అనూష, ఏఎన్ఎం సుమంగళ, స్నేహ, ఆశ తదితరులు పాల్గొన్నారు.