MPDO Ramesh: స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం: ఎంపీడీవో రమేష్

సిరాన్యూస్‌, బోథ్‌
స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం: ఎంపీడీవో రమేష్
* సాయినగర్‌కు కదిలిన అధికార యంత్రాంగం

సాయిన‌గ‌ర్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ఎంపీడీవో రమేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం సమీపంలోని సాయి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీవాసులతో పాటు పలువురు సామాజిక సేవకులు కాలనీవాసుల సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకురావడం జరిగింది. అంతేగాక పలు పత్రికలలో వార్త కథనాలు వ‌చ్చాయి. అయితే అధికార యంత్రాంగం మంగళవారం కాలనీకి వ‌చ్చారు.ఎంపీడీవో రమేష్ తో పాటు గ్రామపంచాయతీ, ఈవో అంజయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి వెళ్లారు. కాల‌నీవాసులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *