శనిగరం జడ్పీ స్కూలును పరిశీలించిన కలెక్టర్

సిరా న్యూస్,సిద్దిపేట;
కోహెడ మండలం శనిగరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను కలెక్టర్ ఏ. మను చౌదరి సందర్శించారు.
పాఠశాలలో గల వసతులను పరిశీలించి పదవ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ వెళ్ళిన సమయంలో ఇంగ్లీష్ పీరియడ్ జరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ వారికి ఇంగ్లీష్ భాషలో గల పరిజ్ఞానంను పరిశీలించి భాష ఏదైనా పర్ఫెక్ట్ గా రావాలంటే తప్పకుండా రోజు మాట్లాడాలని అన్నారు. లైబ్రరీలో ఉన్న గ్రామర్ పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయిన బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ వాటికి తాళం వేసుకున్నారని పాఠశాల హెచ్ఎం సరళ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారితో మాట్లాడి తెరిపిస్తానని జిల్లా కలెక్టర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *