సిరాన్యూస్, ఖానాపూర్
మున్నూరు కాపు సంఘం ఖానాపూర్ అధ్యక్షులుగా పసుపుల నరేందర్
ఖానాపూర్ మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులుగా పసుపుల నరేందర్ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా పసుపుల నరేందర్ ను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే గత రెండు సంవత్సరాల నుండి మున్నూరు కాపు సంఘం అభివృద్ధికై అహర్నిశలు కృషిచేసిన అధ్యక్షులు పాదం రాజారెడ్డి నీ మున్నూరు కాపు సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సంఘ సభ్యులు పాల్గొన్నారు.