Muppuri Devaraj: ఆర్‌డీఓ రాణి సుస్మిత‌కు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ విన‌తి

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
ఆర్‌డీఓ రాణి సుస్మిత‌కు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ విన‌తి

కళ్యాణ్ దుర్గం మండలంలోని గరుడాపురం పంచాయతీ కుర్లపల్లి గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 8 విస్తీర్ణం 4.66 భూమిని గత ప్రభుత్వంలోని నాయకులు కబ్జా చేశారని మంగ‌ళ‌వారం ఆర్డిఓ రాణి సుస్మిత కళ్యాణదుర్గం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నాయకులు స్మశాన వాటిక స్థలాలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నార‌ని ఆరోపించారు. కబ్జాకు గురైన కుర్లపల్లి గ్రామంలోని స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించి ప్రహరీ గోడనిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆర్డీవోను కోరారు. స్మశాన వాటిక భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాల‌న‌నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో కళ్యాణదుర్గం బీజేపీ పట్టణ అధ్యక్షులు కే రామకృష్ణ, కుర్లపల్లి గ్రామస్తులు మధు హరిజన, హనుమంతప్ప, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *