సిరాన్యూస్, గన్నేరువరం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి: కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి మిగిలిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ ఆరోపించారు. మంగళవారం గన్నేరు వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రధానమంత్రి కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కేంద్రానికి బీజేపీ పార్టీలో 8 మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకు అన్యాయమే చేసారన్నారు. కేవలం పీఎం కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు.