సిరాన్యూస్,బోథ్
బోథ్ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ: బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్
బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేకును కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం బోథ్ సివిల్ ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బొడ్డు సర్పంచ్ల, సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తో పాటు పలు గ్రామాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు