ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించిన స్పెషల్ చీప్ సెక్రెటరీ సిసోడియా

సిరా న్యూస్,మదనపల్లె;
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని స్పెషల్ చీప్ సెక్రెటరీ (రెవెన్యూ) సిసోడియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ట్రాన్స్కో జేయండీ చక్రధర్ బాబు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, తదితరులు స్పెషల్ సిఎస్ తో పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ (రెవెన్యూ) సిసోడియా మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని, అగ్ని ప్రమాదానికి గల కారణాలను త్వరితగతిన గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆదివారం అర్ధరాత్రి ఎన్ని గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది. ఇన్వైటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. సబ్ కలెక్టర్ చాంబర్ ఎక్కడ. వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన 22 (ఎ ) విభాగానికి సంబంధించిన గదిలోని కాలిపోయిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టు ప్రక్కల మరియు ఆర్డీవో కార్యాలయపు వెలుపలి వైపు చుట్టూ ప్రహరీ గోడను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె రాయచోటి ఆర్డీవోలు, తాసిల్దార్ లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *