సిరాన్యూస్,ఆదిలాబాద్
కేటీఆర్ ఆలోచన యావత్ సమాజానికే స్ఫూర్తివంతం: మాజీ మంత్రి జోగు రామన్న
* ఘనంగా కేటీఆర్ జనదిన వేడుకలు
* మొక్కలు నాటిన జోగురామన్న
పుట్టినరోజు వేడుకలలో ఆడంబరాలు వద్దు… పర్యావరణ కార్యక్రమాలే ముద్దు అన్న కేటీఆర్ ఆలోచన యావత్ సమాజానికే స్ఫూర్తివంతం అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు . బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతలు పాల్గొనగా, వారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్నమాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ సేవలను విస్తరింపచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పాటు పడ్డారని అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు రౌత్ మనోహర్, రోకండ్ల రమేష్, అలాల్ అజయ్, సేవ్వ జగదీష్, సాజిదోద్దీన్, విజ్జగిరి నారాయణ, మర్శెట్టి గోవర్ధన్, వేణుగోపాల్ యాదవ్,ఇజ్జగిరి నారాయణ,కస్తాల ప్రేమల, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు