సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు దేవాలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.రాత్రి నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని తెరచి దోచుకెళ్ళారు. అందులో ఉన్న 50 వేల నగదును ఎత్తుకెళ్లారు.మండలంలో పలు దేవాలయాల్లో వరుస చోరీలు జరగడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.రాత్రి జరిగిన ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.