Youth Congress Raghuyadav: ఎంపీ బండి సంజయ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

సిరాన్యూస్‌,సైదాపూర్:
ఎంపీ బండి సంజయ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
* యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆసరి రఘుయాదవ్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సైదాపూర్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసరి రఘుయాదవ్ డిమాండ్ చేశారు. బుధ‌వారం సైదాపూర్ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారణమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *