మంథని పట్టణ వీధుల్లో యదేచ్చగా ఆవుల సంచారం

-వీధిలో తిరిగే ఆవులను గోశాలలకు పంపించాలి
-మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
 సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణ వీధుల్లో ఆవుల సంచారం ఎక్కువైంది. ప్రధానంగా రహదారుల పైనే పదుల సంఖ్యలో ఆవులు,లెగలు తిష్టవేస్తూ ప్రజల రాకపోకలకు, వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ముక్యంగా గాంధీ చౌక్, బతుకమ్మ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన రహదారి, శ్రీపాద చౌక్, కూరగాయల మార్కెట్ తో పాటు తదితర ప్రాంతాల్లో ఆవుల సంచారం ఎక్కువగా ఉంది.
వీధుల్లో సంచరించే ఈ ఆవులు ప్లాస్టిక్ వ్యర్ధాలను తినటం వల్ల ఈ మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా వాహనాలకు అడ్డం వస్తూ ప్రమాదాలకు సైతం గురవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు సైతం క్రిందపడి గాయాల పాలు అవుతున్నారు. ఆవులు ఆవులు కొట్లాడుతూ ప్రజలను సైతం గాయపరుస్తున్నాయి. ఈ ఆవులు ఇక్కడ పడితే అక్కడ పేడ వేస్తూ పారిశుద్దాన్ని సైతం దెబ్బ తీస్తున్నాయి. ఆవులను రోడ్లపైకి వదల వద్దని గతంలో మున్సిపల్ అధికారులు ఆవుల యజమానులకు సూచించినప్పటికీ ఫలితం లేదు. రోడ్లపైకి వదిలిన ఆవులను గోశాలలకు పంపించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *