సిరా న్యూస్,హైదరాబాద్;
ఆషాడ మాసం సందర్భంగా సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మారు బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 28 జరిగే బోనాల వేడుకలలో భాగంగా ముందుగా మారు బోనాల కార్యక్రమం జరిపారు. ఈ మారు బోనాల ఊరేగింపు సైదాబాద్ హనుమాన్ మఠం నుంచి నాగులమ్మ ఆలయం వరకు కొనసాగింది శివసత్తు ల బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు, బ్యాండ్ మేళా లతో కనుల పండగగా కొనసాగింది. ఊరేగింపులో స్థానికులు. వివిధ పార్టీల నేతలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…