సిరాన్యూస్,కళ్యాణదుర్గం
మత్తు పదార్థాలకు బానిస కావద్దు: రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత
మత్తు పదార్థాలకు బానిస కావద్దని యువత భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలి అని కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత అన్నారు. బుధవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం ఫై ఏర్పాటు చేసిన సమావేసానికి ముఖ్య అధితిగా హాజరు అయ్యారు. ఈసందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వలన భవిష్యత్తు తరాల్లో ఎలాంటి సంఘటనలు సంభవిస్తాయో అనే అంశాల ఫై కులాంకుశం గా వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్ మల్లికార్జున మాటాడుతూ ప్రాచయత దేశల సంస్కృతులకు ఆకర్షతులై చెడు వేసనాలకు బానిస కావడం జరుగుతుందన్నారు. కుటుంబ సమస్యల పై కలత చెంది మత్తు పదార్థాలకు వ్యసనంగా మారడం, భవిష్యత్తలో చాలా తప్పిదాలకు దారి తీస్తుంది అన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ మాట్లాడుతూ కుటుంబం లోని తల్లి దండ్రులతో సఖ్యతగా మెలిగి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకోనిరావాలన్నారు. అధ్యాపకులు జగన్నాథ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేష్ బాబు మాటాడుతూ విద్యార్థులు మంచి విద్య, బోధనలతో భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలనే బాధ్యత విద్యార్థుల మీద ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.