సిరాన్యూస్,ఓదెల
బుస్సారపు చిరంజీవి చూపు సజీవం: సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి
* నేత్రదానంతో ఇద్దరికి చూపును ప్రసాదించిన చిరంజీవి
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
* నేత్రాలను సేకరించిన ఎల్విపి టెక్నీషియన్ సతీష్
బుస్సారపు చిరంజీవి చూపు సజీవమని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి అన్నారు. పెద్ద పల్లి జిల్లా ఓదెలకు చెందిన బుస్సారపు చిరంజీవి (35) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈసందర్భంగా భూసారాపు.రాజు ఒప్పుకోవడంతో కరీంనగర్ ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్విపి ఐ బ్యాంక్ పంపించారు.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన తల్లి తండ్రులు భారత, కనకయ్య భార్య దివ్య కూతుర్లు శరణ్యం, అరణ్య లకు . క్యాతం మల్లేశం ,క్యాతం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఈ ప్పన పెళ్లివెంకటేశ్వర్లు, మేరుగు సారంగం,సంతోష్ అభినందనలు తెలిపారు. అనంతరం సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు , పృథ్విరాజ్, నరహరి, లగిశెట్టి చంద్రమౌళి, బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.